ముంబై ,జూన్ 3: కరోనా లాక్డౌన్, ఆంక్షల నేపథ్యంలో నగదు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు హెచ్డీఎఫ్సి బ్యాంకు ఇటీవల మొబైల్ ఏటీఎం సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆయా సేవలను మరికొన్ని నగరాలకు విస్తరించింది. హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా 50 నగరాల్లో ఈ మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సి ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై, బెంగళూరు నగరాలు ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి తదితర నగరాల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ మొబైల్ ఏటీఎం ప్రతి రోజు మూడు నుంచి నాలుగు ప్రాంతాలను కవర్ చేస్తున్నది. ఈ ఏటీఎంలలో 15 ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చు.
ఈ మొబైల్ ఏటీఎంలు ఇప్పటికే ప్రస్తుతం చెన్నై, ముంబై, ఢిల్లీ,గురుగ్రామ్, డెహ్రాడూన్, కటక్, లుథియానా, లక్నో, భువనేశ్వర్, చండీగఢ్, తిరువనంతపురం, నోయిడా, బెంగళూరు, మైసూరు, జైపూర్, పానిపట్, అంబాలా, జమ్ము, నాసిక్, రేవారీ, పాట్నా తదితర నగరాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.