న్యూఢిల్లీ: భారత్ సహా కొన్ని పేద దేశాల్లో విక్రయిస్తున్న బేబీ ఫుడ్ ఉత్పత్తుల్లో అధిక చక్కెర వాడుతున్నారన్న ఆరోపణలపై ‘నెస్లే ఇండియా’ స్పందించింది. గత ఐదేండ్లుగా భారత్లో తాము విక్రయిస్తున్న చిన్న పిల్లల ఆహార ఉత్పత్తుల్లో చక్కెరను 30 శాతానికిపైగా తగ్గించామని ఆ కంపెనీ ప్రకటించింది. యూరప్ దేశాలతో పోల్చితే ఇండియాలో నెస్లే విక్రయిస్తున్న బేబీ ఫుడ్ ప్రొడక్ట్స్లో చక్కెర ఎక్కువ ఉందని స్విస్ ఎన్జీవో ‘పబ్లిక్ ఐ’ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఇండియాలో నెస్లే విక్రయిస్తున్న 15 రకాల సెరిలాక్ ఉత్పత్తుల్లో ఒక్కో సర్వ్లో 2.7 గ్రాముల చక్కెర ఉంటున్నదని తెలిపింది.