బాలీవుడ్ ప్రేమజంట రణబీర్కపూర్, అలియాభట్ వివాహం గురించి హిందీ చిత్రసీమలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. గత నాలుగేళ్లుగా ప్రేయాయణం సాగిస్తున్న ఈ జోడీ 2020 డిసెంబర్లోనే విహం చేసుకోవాలని అనుకున్నారు. కరోనా ప్రభావంతో వీరి పెళ్లి వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ నెలలోనే ఈ జంట వివాహానికి ముహూర్తం ఖరారు చేశారని తెలిసింది. ప్రస్తుతం రణబీర్, అలియాభట్ వరుస సినిమాలతో కెరీర్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలన్నీ పూర్తయ్యాకే పెళ్లిపీటలెక్కాలని భావించారు. అయితే అలియాభట్ తాత ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో సాధ్యమైనంత త్వరగా వివాహఘట్టాన్ని పూర్తిచేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారట. ఆ కారణంగానే ఈ నెల మూడోవారంలోనే పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారని, ముంబయిలోనే ఈ వేడుక జరుగుతుందని రణబీర్ సన్నిహిత కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 13-17 తేదీల మధ్యలో మెహందీ, సంగీత్ వేడుకలకు సన్నాహాలు చేశారని తెలిసింది. ఏప్రిల్ మూడోవారంలో దగ్గరి బంధువులందరూ అందుబాటులో ఉండాలని సమాచారం అందించారని అంటున్నారు. కపూర్ వంశానికి చెందిన వారసత్వ నివాసం ఆర్కేహౌస్లో రణబీర్కపూర్, అలియాభట్ల వివాహం జరుగుతుందని…అతికొద్దిమంది సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందనుందని సమాచారం.