పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ మహిళా కోర్ట్లోకి దూసుకువచ్చి ఆందోళన చేపట్టింది. క్యాస్పర్ రూడ్, మారిన్ సిలిక్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కోర్ట్లోకి దూసుకువచ్చిన ఆ మహిళ నెట్కు తనను తానే కట్టేసుకున్నది. ఇనుప వైర్లతో ఆమె నెట్కు ముడులు వేసుకున్నది. ఫిలిప్ చార్టియర్ కోర్ట్లో ఈ ఘటన జరిగింది. దీంతో సుమారు 13 నిమిషాల పాటు మ్యాచ్ను ఆపేశారు.
ఆ మహిళ నినాదాలతో ఉన్న ఓ టీ షర్ట్ వేసుకున్నది. మనకు ఇంకా 1028 రోజులు ఉన్నాయని ఆ టీషర్ట్పై రాసి ఉంది. కోర్ట్లోకి దూసుకువచ్చిన ఆ మహిళను పర్యావరణ కార్యకర్తగా గుర్తించారు. సెక్యూర్టీ సిబ్బంది వచ్చి ఇనుప వైర్లను తొలగించి ఆమెను అక్కడ నుంచి తీసుకువెళ్లారు. మ్యాచ్ను వీక్షించేందుకు సరైన టికెట్తోనే ఆమె స్టేడియంలోకి ఎంటరైనట్లు గుర్తించారు. మ్యాచ్ను రూడ్ కైవసం చేసుకుని ఫైనల్లోకి దూసుకువెళ్లాడు.
కోర్ట్లో నిరసన చేపట్టిన మహిళను 22 ఏళ్ల అల్జీగా గుర్తించారు. డెర్నిర్ రెనోవేషన్ సంస్థకు చెందినట్లు భావిస్తున్నారు. క్లైమేట్ ఎమర్జెన్సీపై ఆమె ప్రచారం నిర్వహిస్తోంది. మెటల్ వైర్ను ఆమె మెడవకు చుట్టుకుని దాన్ని కోర్ట్ నెట్కు కట్టేసుకున్నది.