ఇస్లామాబాద్: మాజీ పాకిస్థాన్ అంపైర్ అసద్ రౌఫ్ .. లాహోర్లో గుండెపోటుతో మృతిచెందాడు. 2006 నుంచి 2013 వరకు ఆయన ఐసీసీ ఎలైట్ ప్యానల్లో సభ్యుడిగా చేశాడు. రౌఫ్ వయసు 66 ఏళ్లు. రౌఫ్ మృతి పట్ల పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజా రాజా సంతాపం వ్యక్తం చేశారు. అసద్ మంచి అంపైర్ అని, ఆయనకు హ్యాస చతురత కూడా ఎక్కువే అని అన్నారు. ఐసీసీ అంపైర్ అసద్ రౌఫ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ తెలిపారు. 2000 సంవత్సరంలో తొలిసారి వన్డేకు అంపైరింగ్ చేశాడాయన. 2005లో తొలిసారి టెస్టు మ్యాచ్కు అంపైర్గా చేశాడు. మొత్తం 64 టెస్టులకు, 139 వన్డేలకు, 28 టీ20లకు అంపైరింగ్ చేశాడు. ఐపీఎల్ మ్యాచ్లకు కూడా రౌఫ్ అంపైర్గా చేశాడు. 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన రౌఫ్ 3423 రన్స్ చేశాడు.