న్యూఢిల్లీ: భారత పురావాస్తు శాఖ మాజీ డైరక్టర్ జనరల్ బీబీ లాల్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషణ్ రెడ్డి వెల్లడించారు. మంత్రి తన ట్వీట్లో ఆర్కియాలజీ ప్రొఫెసర్ బీబీ లాల్కు నివాళి అర్పించారు. బీబీ లాల్ అమోఘమైన మేధావి అని, దేశంలో పురాతత్వ పరిశోధనలకు విశేష సేవలు అందించారని, గత 4 దశాబ్ధాలుగా యువ ఆర్కియాలజిస్టులకు శిక్షణ ఇచ్చినట్లు మంత్రి తన ట్వీట్లో వెల్లడించారు. బీబీ లాల్ను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు ఉన్న స్థానంలోనే రామ మందిరం ఉండేదని బీబీ లాల్ తన పరిశోధనల్లో రచించారు. ఆ పరిశోధన రచనల ఆధారంగానే సుప్రీంకోర్టు రామ మందిర ఆలయ నిర్మాణానికి అనుకూల తీర్పునిచ్చింది.