టోక్యో: ఎగిరే బైక్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. జపాన్కు చెందిన స్టార్టప్ ఏఎల్ఐ టెక్నాలజీస్ తాము రూపొందించిన ‘ఎగిరే బైక్’ అమ్మకాలను మంగళవారం ప్రారంభించింది. ఒక్కో బైక్ ఖరీదు 77.7 మిలియన్ యెన్లుగా (దాదాపు 5.09 కోట్ల రూపాయలు) నిర్ణయించింది. ఈ బైక్లో నాలుగు బ్యాటరీలు ఉంటాయి. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో 40 నిమిషాలపాటు ఎగురగలదు.