భోపాల్, డిసెంబర్ 1: మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ లింగమార్పిడి అభ్యర్థనను ఆ రాష్ట్ర హోంశాఖ మన్నించింది. లింగమార్పిడి చికిత్సకు బుధవారం అనుమతించింది. ‘రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగంలో పనిచేస్తూ లింగమార్పిడి చేసుకొంటున్న మొట్టమొదటి వ్యక్తి ఈ మహిళే’ అని అడిషనల్ చీఫ్ సెక్రెటరీ రాజేశ్ రాజోరా చెప్పారు. పేరు వెల్లడించలేదు. చికిత్స అనంతరం ఆమె పురుషుల విధులు నిర్వహించనున్నారు. లింగమార్పిడి కోసం సదరు మహిళా కానిస్టేబుల్ 2019లో దరఖాస్తు చేసుకొన్నారు.