నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ఏప్రిల్ 16న విడుదల కానున్న ఈ చిత్రం జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. చిత్రం నుండి ఒక్కో సాంగ్ విడుదల చేస్తూ అంచనాలు పెంచుతున్న మేకర్స్ తాజాగా ఏవో ఏవో కలలే… అంటూ సాగే పాటని మహేష్ బాబుతో విడుదల చేయించారు. ఇప్పటిదాకా విడుదలైన ఈ సినిమాలోని ప్రతి పాట శ్రోతల్ని ఉర్రూతలూగించిగా, తాజాగా విడుదలైన వాన నేపథ్యంలో సాగే ‘ఏవో ఏవో కలలే…’ పాట కూడా రంజింపజేస్తుంది.
తన చిత్రంకు సంబంధించిన సాంగ్ విడుదల చేసినందుకు మహేష్కు కృతజ్ఞతలు తెలియజేసిన నాగ చైతన్య.. మహర్షి సినిమాకు నేషనల్ అవార్డ్ దక్కినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు . కాగా చైతూ ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా చేస్తుండగా, ఇందులో మహేష్ అభిమానిగా కనిపించి అలరించనున్నాడు ఈ అక్కినేని హీరో.