హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కాంక్రీట్ మిక్సర్ లారీ కింద పడి ఇంజినీర్ లోకేశ్ మృతి చెందాడు. చెక్ డ్యామ్ వద్ద లోకేశ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు లోకేశ్ మిక్సర్ లారీ కింద పడడంతో ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.