న్యూఢిల్లీ: గో ఫస్ట్ సంస్థకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ముంబై నుంచి లేహ్, ఆ తర్వాత శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానాల్లో ఈ సమస్యలు వచ్చాయి. ఇంజిన్లో సమస్యలు డెవలప్ అయ్యాయని, రెండు విమానాలను గ్రౌండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబై నుంచి లేహ్ వెళ్తున్న విమానాన్ని ఢిల్లీకి మళ్లించినట్లు చెప్పారు. ఇంజిన్ నెంబర్ 2లో సమస్యలు వచ్చినట్లు అంచనా వేశారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానాన్ని కూడా మధ్యలోనే మళ్లీ శ్రీనగర్కు మళ్లించారు. దాంట్లో కూడా రెండో నెంబర్ ఇంజిన్లో సమస్యలు వచ్చినట్లు డీజీసీఏ అధికారులు చెప్పారు.