హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థలను ప్రైవేటుపరం కానివ్వబోమని ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. ఆదివారం జీటీఎస్కాలనీలోని జెక్కో ఆడిటోరియంలో నిర్వహించిన తెలంగాణ విద్యుత్తు అకౌంట్స్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యుత్తు రంగంలో మరింత ముందుకుపోవాలని సూచించారు. సమావేశంలో విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి పీ అంజయ్య, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, ఎస్పీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ నరసింహారావు, సీజీఎంలు తిరుపతిరెడ్డి, పీ ఆనంద్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.