పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
న్యూశాయంపేట, మే 1: వెలమ కులస్థుల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ హంటర్రోడ్డులోని అభిరామ్ గార్డెన్స్లో సంఘం అధ్యక్షుడు పేరాల మధుసూదన్రావు అధ్యక్షతన 27వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
అనంతరం సావనీర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెలమ కులస్థుల్లో ఉన్నతంగా ఎదిగిన వారు ఎందో ఉన్నారన్నారు. చాలా మంది రాజకీయాల్లోనూ రాణిస్తున్నారని చెప్పారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన తక్కళ్లపల్లి రవీందర్రావును సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మాజీ మేయర్ టీ రాజేశ్వర్రావు, వెలమ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బోంపెల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.