‘ప్రాణంగా ప్రేమించిన ప్రియుడి కోసం అతడి జ్ఞాపకాల దారుల్లో ప్రయాణించిన ఓ భగ్న ప్రేయసి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు వంశీకృష్ణ దొండపాటి. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏడ తానున్నాడో’. అభినవ్ మణికంఠ, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్నారు. గుజ్జా యుగంధర్రావు నిర్మాత. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. ఇటీవల ట్రైలర్ను చిత్రబృందం విడుదలచేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘అడ్వెంచరస్ థ్రిల్లర్గా రూపొందుతున్న ప్రేమకథా చిత్రమిది. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించిన అభినవ్ మణికంఠ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. కోమలి ప్రసాద్ పాత్ర ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని తెలిపారు. శివాజీరాజా, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం: చరణ్ అర్జున్.