న్యూఢిల్లీ: రూ.200 కోట్ల బెదిరింపు కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును ఛార్జ్షీట్లో దాఖలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నమోదు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో జాక్వెలిన్ పేరును చేర్చారు. ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్ర శేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన గిఫ్ట్లు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మనీల్యాండరింగ్ కేసులో జాక్వెలిన్ను ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జాక్వెలిన్కు చెందిన 7 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. మనీల్యాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి నటి జాక్వెలిన్ ఖరీదైన వస్తువుల్ని తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.