న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ-శ్రామ్ పోర్టల్ను ఆవిష్కరించనుంది. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న నిర్మాణ, ఇతర కార్మికుల వివరాలను డేటా బేస్లో స్టోర్ చేయనుంది. సంబంధిత సమస్యలను ‘14434’ జాతీయ టోల్ ఫ్రీ నంబర్ను సైతం ప్రారంభించనున్నారు. ఇప్పటికే పోర్టల్కు సంబంధించిన లోగోను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ నెల 24న ఆవిష్కరించారు. దేశాన్ని నిజంగా నిర్మించే శ్రామికులు అసంఘటిత రంగానికి చెందిన వారేనని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా నేషన్ బిల్డర్స్ అయిన అసంఘటిత రంగ కార్మికుల డేటాను రికార్డ్ చేయబోతున్నామని, పోర్టల్ ఆధారంగా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కృషి చేసేందుకుగాను కేంద్రప్రభుత్వం కృషి చేయనుందని కేంద్రం మంత్రి తెలిపారు. నిర్మాణ, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు సహా 38కోట్ల మంది అసంఘటిత కార్మికులను నమోదు చేయాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
పోర్టల్లో కార్మికులు ఆధార్కార్డు, బ్యాంక్ ఖాతాను వినియోగించి శ్రామ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, స్వస్థలం, సామాజిక వర్గం వంటి ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వాలి ఉంటుంది. ప్రతీ ఒక్కరికి ఆధార్ నెంబర్ మాదిరిగా 12 నెంబర్ల యూనివర్స్ అకౌంట్ నెంబర్ ఇవ్వనుంది. ఈ పన్నెండు సంఖ్యల యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) ద్వారా వారికి ఒక ఐడెంటిఫికేషన్ రానుంది.