హైదరాబాద్ : భూపాలపల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే స్థానిక తాడిచర్ల సింగరేణి బొగ్గును వినియోగించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించొద్దని కేంద్రానికి సూచించారు. తాడిచర్ల నుంచి బొగ్గు ఇతర రాష్ట్రాలకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు రాష్ట్ర సింగరేణి అధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉందని చెప్పి తాడిచర్ల నుంచి సింగరేణి బొగ్గును తరలించి.. భూపాలపల్లి విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలిగిస్తే ఎలా..? కేంద్రాన్ని ప్రశ్నించారు. తాడిచర్ల నుంచి సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న ఆలోచనను మానుకోవాలని కేంద్రానికి హితవు పలికారు.