కరోనా కారణంగా ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ పేమెంట్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో షాపింగ్.. స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్లు.. ప్రైమ్, నెట్ఫ్లిక్స్ రీచార్జ్.. ఇలా అన్ని సౌకర్యాలు ఆన్లైన్లోనే అందుబాటులోకి వచ్చాయి. చెల్లింపులు కూడా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. అయితే, కార్డు ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపే ప్రతీసారి 16-అంకెల కార్డు వివరాలు, కార్డు గడువు తేదీని గుర్తుంచుకోవాల్సి రావడం పలువురికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే ‘టోకనైజేషన్’
ఏమిటీ ‘టోకనైజేషన్’?
డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఒకేసారి సమీకరించి, హ్యాకర్లకు చిక్కకుండా భద్రపరిచే కీవర్డ్నే ‘టోకెన్’ అంటారు. కస్టమర్ వ్యక్తిగత సమాచారం, కార్డు వివరాలను రెండోసారి అడగకుండా అత్యంత సెక్యూరిటీతో లావాదేవీలను నిర్వహించే ప్రక్రియనే ‘టోకనైజేషన్’గా పిలుస్తున్నారు. ఈ కాంటాక్ట్లెస్ బ్యాంకింగ్ కోసం ప్రతీసారి సీవీవీ నంబర్ అవసరం లేదు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.
అవసరమేంటి?
‘టోకనైజేషన్’ ద్వారా ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టొచ్చు. కొనుగోళ్లు జరిపే ప్రతీసారి కార్డు 16 అంకెలను నమోదు చేయడం, సీవీవీని ఎంటర్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు, సైట్లోని థర్డ్ పార్టీ.. కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలను తస్కరించే ప్రమాదం ఉన్నది. అయితే, ‘టోకనైజేషన్’తో దీనికి చెక్ పెట్టొచ్చు. హ్యాకర్లు టోకెన్ నుంచి కొనుగోలుదారు సమాచారాన్ని సేకరించడం సాధ్యం కాదు. ఎందుకంటే, ‘టోకనైజేషన్’లో రివర్స్ ఇంజినీరింగ్ టెక్నిక్ను వినియోగించడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు.
ఎలా ఉపయోగించాలి?