న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కాంప్యాక్ట్ ఎస్యూవీ అర్బన్ క్రూజర్, ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజాల ధరలను మే 1 నుంచి పెంచుతున్నట్లు టయోటా కిర్లోస్కర్ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం అధికమవడంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. ఎంత శాతం మేర పెంచిన విషయం సంస్థ వెల్లడించలేదు. ప్రస్తుతం అర్బన్ క్రూజర్ రూ.8.88 లక్షల నుంచి రూ.11.58 లక్షల మధ్యలో, గ్లాంజా రూ.6.39-9.96 లక్షల మధ్యలో లభిస్తున్నది. ముడి సరుకుల ధరలు భగ్గుమనడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.