సిటీబ్యూరో, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ): లోక్ అదాలత్లో ఎక్కువ కేసులను పరిష్కరించిన అధికారులను సీపీ అంజనీకుమార్ అభినందించారు. శనివారం జరిగిన లోక్ అదాలత్లో 1755 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందుకు కృషి చేసిన ఆయా డివిజన్ ఏసీపీలు, ఇన్స్పెక్టర్లను సీపీ అభినందించారు. ఇందులో ఏసీపీలు పి.నరేశ్రెడ్డి(బేగంపేట్), గణేశ్ (పంజాగుట్ట), భిక్షంరెడ్డి (ఇన్చార్జి, చార్మినార్), ఎన్.సుధీర్(గోపాలపురం), వేణుగోపాల్రెడ్డి(సైఫాబాద్), వెంకటరమణ(మలక్పేట్), స్టేషన్ హౌస్ అధికారులు ఇన్స్పెక్టర్లు కె.సైదులు(ఎస్ఆర్నగర్), సైదిరెడ్డి(సైఫాబాద్), జి.నరేశ్(చిలకలగూడ), పల్లె పద్మ(నార్త్జోన్ మహిళా పోలీస్స్టేషన్), జానకమ్మ(సౌత్జోన్ మహిళా పోలీస్స్టేషన్) ఉన్నారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు సీపీ శిఖాగోయెల్ పాల్గొన్నారు.