హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామశివారులో పురుగుల మందు తాగి యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
మృతులను ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన సాయిలు (30), శైలజ (28)గా పోలీసులు గుర్తించారు.
మృతులిద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహమైంది. శైలజ భర్త కొంతకాలం క్రితం మృతి చెందాడు.ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.