అమరావతి : ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ సత్ఫలితాలను ఇస్తున్నది. కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 11,303 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 18,257 మంది కోలుకున్నారు. 104 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 1,70,4388కి పెరిగాయి. 1,54,6617 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇంకా 1,46,737 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 11034కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 93,704 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.