సంగారెడ్డి, డిసెంబరు 31: నిరుపేదలకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి ఆదుకుంటున్నదని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సదాశివపేట మాజీ ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో నియోజకవర్గంలో నాలుగు మండలాలు, రెండు మున్సిపాల్టీల్లో ప్రైవేట్ దవాఖానల్లో ఖర్చు పెట్టిన 106 మంది బాధిత కుటుంబాలకు రూ.44.65 లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కంది మండలంలో 20 మందికి రూ.7.22 లక్షలు, సంగారెడ్డి మండలంలో ఆరుగురికి రూ.2.10లక్షలు, సంగారెడ్డి పట్టణంలో 15 మందికి రూ.6.64లక్షలు, సదాశివపేట మండలంలో 27 మందికి రూ.11.40లక్షలు, సదాశివపేట పట్టణంలో 20 మందికి రూ.7.87లక్షలు, కొండాపూర్ మండలంలో 16 మందికి రూ.8.99లక్షలు, మరో ఇద్దరికి రూ.42 వేల చెక్కులను బాధితుల కుటుంబ సభ్యలకు అందజేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యాదమ్మ, కంది జడ్పీటీసీ కొండల్రెడ్డి, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, ఆకుల శివ, టీఆర్ఎస్ పట్టణ, మండల పార్టీల అధ్యక్షులు చీల మల్లన్న, గొల్ల ఆంజనేయులు, మ్యాకం విఠల్, మధుసూదన్రెడ్డి, కొత్తపల్లి చక్రపాణి, ఆర్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, వీరేశం, గోవర్దన్రెడ్డి, గురునాథ్రెడ్డి ఉన్నారు.
సీఎం ఆర్ఎఫ్ పేదలకు వరం..
కొండాపూర్, డిసెంబర్ 31: సీఎం ఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. కొండాపూర్ మండలానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ.8 99 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మావ తీ పాండురంగం, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు మాక్యం విఠల్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు రుక్మోద్దీన్, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షులు విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్ ప్రకాశ్, యువత మండలాధ్యక్షులు కుమార్, టీఆర్ఎస్ నాయకులు రఘునాథ్రెడ్డి, ప్రవీణ్కుమార్, మొగులయ్య, మోహన్గౌడ్, అంజీరెడ్డి, ధరమ్సింగ్, కుమార్ శేఖర్ పాల్గొన్నారు.