నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 30 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు విచారణ నిమిత్తం సీఎం రేవంత్రెడ్డి శనివారం ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణకు హాజరుకావాలని జడ్జి శ్రీదేవి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎగ్జామినేషన్ ప్రక్రియకు రేవంత్ హాజరయ్యారు. ఎన్నికల సమయంలో కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించారని, అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని సాక్షులు వాంగ్మూలం ఇవ్వడంపై జడ్జి శ్రీదేవి ప్రశ్నించగా.. ఆలాంటిదేమీ లేదని, తప్పు చేయలేదని సీఎం బదిలిచ్చారు. విచారణను జూన్ 4కు వాయిదా వేస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులోనూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో కూడా తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.
కౌకుంట్ల(దేవరకద్ర), మే 30: కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్తోపాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నా రు. శనివారం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం అజిలాపూర్ వద్ద రూ.32.5 కోట్ల చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు మంత్రి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే జీఎంఆర్, కలెక్టర్ కుష్బూగుప్తాతో కలిసి శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : జన జీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు సీపీఐలో చేరాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. శనివారం మాజీ మావోయిస్టులు దేవ్జీ(తిప్పిరి తిరుపతి), మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్), పుల్లూరి ప్రసాద్(చంద్రన్న) సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర నాయకత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.
త్యాగధనులను అందించిన చరిత్ర ఏఐఎస్ఎఫ్ది
ఎంతోమంది త్యాగధనులను దేశానికి అందించిన గొప్ప చరిత్ర అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)దని వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ‘ఎగసిన ఉద్యమ తరంగం ఏఐఎస్ఎఫ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.