జమైకా: వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్.. ఇండియాకు థ్యాంక్స్ చెప్పాడు. కోవిడ్ టీకాలను ఇటీవల జమైకాకు భారత్ సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో గేల్ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను పోస్టు చేశాడు. ప్రధాని మోదీతో పాటు భారత ప్రభుత్వం, భారత ప్రజలకు .. వ్యాక్సిన్ డొనేట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నానని గేల్ తన సందేశంలో తెలిపాడు. భారత్ చేపడుతున్న ప్రయత్నాలను కొనియాడుతున్నట్లు చెప్పాడు.