హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) విజిలెన్స్ విభాగం రూపొందించిన ‘చేతన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం బీడీఎల్లో నిర్వహించిన కార్యక్రమంలో అనురాగ్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఎస్ రామచంద్రన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీడీఎల్ సీఎండీ సిద్ధార్థమిశ్రా, టెక్నికల్ డైరెక్టర్ పీ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.