న్యూఢిల్లీ: చెస్ బాల మేధావి, 16 ఏళ్ల ఆర్ ప్రజ్ఞానంద వరుసగా ఈ ఏడాది రెండవసారి ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించాడు. చెస్సబుల్ మాస్టర్స్ టోర్నీ అయిదవ రౌండ్లో కార్ల్సన్పై అతను విక్టరీ కొట్టాడు. మూడు నెలల క్రితమే నార్వే ప్లేయర్ కార్ల్సన్పై ప్రజ్ఞా గెలిచాడు. చెస్సబుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో మొత్తం 16 ప్లేయర్లు పాల్గొంటారు. నిజానికి కార్ల్సన్, ప్రజ్ఞానంద మధ్య మ్యాచ్ గేమ్ డ్రా దిశగా వెళ్లింది. కానీ 40వ మూవ్లో కార్ల్సన్ భారీ తప్పిదం చేశాడు. ఇక ఆ తర్వాత మూవ్లో అతను రిజైన్ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్థింగ్స్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ టోర్నీలోనూ కార్ల్సన్పై ప్రజ్ఞా విజయం సాధించాడు. చెస్సబుల్ మాస్టర్స్ టోర్నీలో రెండవ రోజు ఆట ముగిసే వరకు కార్ల్సన్ 15 స్కోర్తో మూడవ స్థానంలో ఉన్నాడు. ప్రజ్ఞానంద 12 పాయింట్లతో అయిదవ స్థానంలో ఉన్నాడు. చైనా క్రీడాకారుడు వియి వైయి 18 స్కోర్తో టాప్ స్పాట్లో ఉన్నాడు.