న్యూఢిల్లీ: మేటి బాక్సర్ మేరీకోమ్( Mary Kom).. పారిస్ ఒలింపిక్స్ బృందానికి చీఫ్ డీ మిషన్గా ఉన్నారు. అయితే ఆ పోస్టు నుంచి వైదొలిగినట్లు ఆమె వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నట్లు బాక్సర్ మేరీకోమ్ తెలిపారు. క్రీడాకారులకు ఇచ్చిన నిబద్ధత నుంచి వెనక్కి తగ్గడం బాధాకరంగా ఉందన్నారు. కానీ తనకు ఎటువంటి ఛాయిస్ లేదని ఆమె వెల్లడించారు. ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు పారిస్ ఒలింపిక్స్ జరగనున్నాయి.