Border – Gavaskar Trophy : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. నాగ్పూర్లో ప్రారంభం కానున్న తొలి టెస్టులో అతను తన ఆఫ్ స్పిన్తో భారత ఆటగాళ్లను ఇబ్బంది పెట్టనున్నాడు. గతంలో కూడా లియాన్ ఇండియన్ క్రికెటర్లను తన బుట్టలో వేసుకున్నాడు. వైవిధ్యమైన బంతులు వేసే అతడిని టార్గెట్ చేయడం భారత జట్టుకు పెద్ద సవాలే. అయితే.. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే లియాన్ను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. అతని బౌలింగ్లో కోహ్లీ 58.6 సగటుతో పరుగులు సాధించాడు. లియాన్ బౌలింగ్లో 52.1 సగటుతో రన్స్ చేసిన పూజారా ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (45.8 సగటుతో) మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తక్కువ సగుటు నమోదు చేశాడు. లియాన్ బౌలింగ్లో రోహిత్ సగటు 22.5 మాత్రమే.
భారత్, ఆసీస్ మధ్య మొదటి టెస్టు నాగ్పూర్లో ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. అయితే.. సొంతగడ్డపై ఘనమైన రికార్డు ఉన్నభారత్ను ఆసీస్ నిలువరిస్తుందా? అనేది ఈ టెస్టులో తెలియనుంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో పునరాగమనం చేయనున్నాడు. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్ రూపంలో భారత స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.
Nathan Lyon will be the biggest threat for Team India 🔥#cricket #indvsaus pic.twitter.com/FyXOv18CD3
— Sportskeeda (@Sportskeeda) February 6, 2023