శివమొగ్గ: కర్ణాటక బీజేపీ తిరుగుబాటు నేత కేఎస్ ఈశ్వరప్ప శుక్రవారం శివమొగ్గ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. భారీ ఊరేగింపుతో వెళ్లి ఈశ్వరప్ప తన నామినేషన్ను దాఖలు చేశారు. నేటి నుంచి తమ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్ర చారం చేస్తారని, బీజేపీలో తన లాంటి నమ్మకమైన కార్యకర్తలకు ఎలా అన్యా యం జరుగుతున్నదో వివరిస్తారని ఈ శ్వరప్ప తెలిపారు. తండ్రీకొడుకుల చేతి లో బీజేపీ ఎలా బాధపడుతున్నదో వివరిస్తారన్న ఈశ్వరప్ప పరోక్షంగా మాజీ సీఎం యెడియూరప్ప, ఆయన కొడుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్రను లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. శివమొగ్గలో బీజేపీ అభ్యర్థిగా బీవై రాఘవేంద్ర పోటీలో ఉన్నారు.