న్యూఢిల్లీ, నవంబర్ 1: ఈ నెల 8 నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. బయోమెట్రిక్ యంత్రాల పక్కన శానిటైజర్ను తప్పనిసరిగా ఉండేలా చూడాలని, ఇది విభాగాధిపతుల బాధ్యతని కేంద్ర సిబ్బంది శాఖ తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఉద్యోగులు హాజరు నమోదుకు ముందు, తర్వాత తమ చేతులను శానిటైజ్ చేసుకోవాలని ఆదేశించింది. కరోనా దృష్ట్యా ఇప్పటివరకు బయోమెట్రిక్ హాజరు నుంచి ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.