మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా అగ్ర హీరో పవన్కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక నేడు జరగనుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం కారణంగా సోమవారం జరగాల్సిన ఈవెంట్ను బుధవారానికి వాయిదా వేశారు. ఈనెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, మాటలు అందించారు. సితార ఎంటర్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. రానా, నిత్యామీనన్, రావురమేష్, మురళీశర్మ, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘సోమవారం రాత్రి విడుదల చేసిన చిత్ర ట్రైలర్కు మంచి స్పందన వస్తున్నది. 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి’ అని చిత్రబృందం తెలిపింది.