హైదరాబాద్, మే 31: మనం ప్రతిరోజూవాడుతున్న పోపు దినుసుల్లో వాముకు చాలా ప్రాధాన్యత ఉన్నది. దీని రుచి ఘాటుగా ఉండడమే కాదు కారంగా ఉంటుంది. అయితే దీని వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీనిని పలు ఔషధాల తయారీలో వాడుతారు. వాము తరచుగా తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. జలుబు, దగ్గు తగ్గి బొంగురు పోయిన గొంతు మళ్ళీ నార్మల్ అవుతుంది.
వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా తేనే వేసుకుని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళూ కరుగుతాయి. శ్వాసకోసం సమస్యలతో ఇబ్బంది పడే వారు వామును టీ చేసుకుని తాగడం మంచిది. అంతేకాదు వాము టీ తాగడం వల్ల క్యాన్సర్ కూడా రాదు. అసిడిటీ తో ఇబ్బంది పడే వారు వాము నీటిని తాగడం వల్ల అసిడిటీ తగ్గుతుంది.
గర్భిణీ మహిళలకు వాము చాలా మంచిది. దీనిని తినడం వల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. డెలివెరీ తర్వాత కూడా వాము తినడం వల్ల గర్భసయం శుభ్రపడడంతో పాటు పాలు కూడా పడతాయని పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్నారు. కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా వాము కీలక పాత్ర పోషిస్తుంది. వాము నూనెను కీళ్లకు మర్దనా చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
వాము మన శరీరంలో పేరుకు పోయిన కొవ్వును తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా కొవ్వు కరిగిపోవాలంటే ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వాము వేసి మరిగించి రోజు తాగడం వల్ల బరువు తొందరగా తగ్గుతుంది. అంతేకాదు రకరకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. తలనొప్పి, మైగ్రేన్, అలసట ను కూడా తగ్గిస్తుంది. వాములో పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు ఎక్కువుగా ఉంటాయి.