న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కొత్త అధిపతిగా గుజరాత్ మాజీ డీజీపీ షాబిర్ హుస్సేన్ను సోమవారం నియమించారు. ప్రస్తుతం ఏసీయూ చీఫ్గా ఉన్న రాజస్థాన్ మాజీ డీజీపీ అజిత్ సింగ్ పదవీకాలం మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ 2018 నుంచి సింగ్ పదవిలో కొనసాగారు.
ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న అజిత్ సింగ్ స్థానంలో షాబిర్ హుస్సేన్ ఈ బాధ్యతలు చేపడతారు. ఐపీఎల్–2021 సీజన్ నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవి కోసం కోసం బీసీసీఐ ఎలాంటి దరఖాస్తులను ఆహ్వానించలేదు. మరో నాలుగు రోజుల్లో చెన్నై వేదికగా ఐపీఎల్ ఆరంభంకానున్న నేపథ్యంలో కొత్త ఏసీయూ బాస్ బుధవారం అక్కడికి వెళ్లనున్నారు.