కోటా, మార్చి 28: రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. సోమ్యా కుర్మి అనే విద్యార్థిని బుధవారం అర్ధరాత్రి ఉరేసుకుని బలన్మరణానికి పాల్పడినట్టు డీఎస్పీ రాజేశ్ తెలిపారు. దీంతో కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఏడుకు చేరింది.
రెండు రోజుల కిందటే మరో నీట్ విద్యార్థి మహ్మద్ ఉరూజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలోని అమేథీకి చెందిన సోమ్యా ఏడాదిగా కోటాలో కోచింగ్ తీసుకుంటున్నది. గురువారం సోమ్యా తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డినట్టు స్నేహితులు తెలిపారు.