ఛండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ బుధవారం కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. బుధవారం నిర్వహించనున్న విలేకరుల సమావేశం సందర్భంగా ఆయన పార్టీ పేరును ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ నేత అయిన అమరిందర్ తనకు అవమానం జరిగిందని పేర్కొంటూ కొద్దికాలం కిందట సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.