‘మీ కోసం నేనున్నా’కు చక్కటి స్పందన
అర్జిదారులతో కిటకిటలాడిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
‘డయల్ యువర్ ఎమ్మెల్యే’కు 26, మీ కోసం నేనున్నాలో 90 విజ్ఞప్తులు
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, మార్చి 16 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేం ద్రమైన మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి నెలా 2,16 తేదీల్లో మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమ స్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ము ఖ్యంగా భూ సమస్యలు, పింఛన్లు, డబుల్ బెడ్రూం తదితర సమస్యలపై ప్రజలు విజ్ఞప్తులు ఇవ్వగా, వాటిని వెంటనే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట, మెదక్, హవేళీఘనపూర్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. హవేళీఘనపూర్ మండలంలోని లింగ్సాన్పల్లి గ్రామానికి చెందిన కవిత ఉద్యోగం ఇప్పించాలని కోరా రు. విద్యుత్ షాక్తో తన పాడి గేదెలు మృతి చెందాయని, పరిహారం ఇప్పించాలని గంగాపూర్ గ్రామానికి చెందిన పోతుల సిద్ధిరాములు విజ్ఞప్తి చేశారు. పాపన్నపేట మండలంలో 19 భూ సమస్యలు పరిష్కారమైనట్టు తెలిపారు. ‘డయల్ యువర్’ ఫోన్ ద్వారా 26 మంది తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, 90 మంది మీ కోసం కార్యక్రమంలో విన్నవించుకున్నారు.
36 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు రూ. 22.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. మెదక్ పట్టణానికి చెందిన తూర్పు నాగభూషణంకు రూ.33వేలు, మెదక్ మండలం మక్తభూపతిపూర్కు చెందిన ఆకుల సందీప్ రూ.60వేలు, బాలానగర్కు చెం దిన సత్తమ్మకు రూ.52వేలు, సాయమ్మకు రూ. 44వేలు, లింగ్సాన్పల్లికి చెందిన రాజు రూ.49 వేల చెక్కులను అందజేశారు. పాపన్నపేట మండ లం కుర్తివాడకు చెందిన ఎంకవ్వకు రూ.60వేలు, శంకరంపేటకు చెందిన పృథ్వీరాజ్కు రూ.60 వేలు, మల్లుపల్లికి చెందిన నర్సింలుకు రూ.44 వేలు, రామాయంపేట మండలం రాయిలాపూర్కు చెందిన లలితకు రూ.34వేలు, శివ్వాయిపల్లికి చెందిన మమతకు రూ.34వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్లు జయరాజ్, కిశోర్, ఆర్కే శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్, నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్, ప్రవీణ్గౌడ్, పాపయ్య, కిషన్, కృష్ణ, దుర్గప్రసాద్, నీటి పారుదల, ఆర్డబ్ల్యూఎస్, వివిధ మండలాలకు చెందిన తాసీల్దార్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
దవాఖానల అభివృద్ధికి సర్కారు పెద్దపీట
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్ర దవాఖానలో ఎన్హెచ్ఎం నిధులు రూ.29.50 లక్షలతో నిర్మించిన హెచ్డీయూ, ఐసీయూ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్ర దవాఖానలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్ర దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో పేదలకు వైద్యం అందిస్తున్నామని గుర్తుచేశారు. గతంలో జిల్లా కేంద్ర దవాఖానలో సరైన సదుపాయాలు లేకపోవడంతో గాంధీ, ఇతర దవాఖానలకు రెఫర్ చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. గతంలో డయాలసిస్ను ఏర్పాటు చేసుకొని కిడ్నీలు ఫెయిలైన వారికి ఇక్కడే సేవలు అందిస్తున్నామన్నారు. అన్ని రకాల పరీక్షలు చేయించుకోవడానికి ప్రత్యేకంగా రోగ నిర్ధారణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దవాఖానల అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. పట్టణ శివారులోని పిల్లికోటాల్ ప్రాంతంలో మాతాశిశు సంరక్షణ కేంద్రం భవనాన్ని కూడా నిర్మిస్తున్నామని, త్వరలో పనులు పూర్తవుతాయని తెలిపారు. జిల్లా కేంద్ర దవాఖానలో ఎన్హెచ్ఎం నిధులు రూ.54 లక్షలతో 20 పడకల ప్రత్యేక నవజాత కేర్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు రాగి వనజ, కిశోర్, వసంత్రాజ్, జయరాజ్, టీఆర్ఎస్ నాయకులు రాగి అశోక్, ప్రవీణ్గౌడ్, సుమన్, మాయ శ్రీనివాస్ పాల్గొన్నారు.