న్యూఢిల్లీ : రాజకీయాలపై బాలీవుడ్ నటుడు సోనుసూద్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాదిలో జరుగనున్న పంజాబ్ ఎన్నికల్లో తన సోదరి మాళవిక పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మోగాలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. కొవిడ్ సంక్షోభ సమయంలో వలస కూలీలతో పాటు ఎంతో మందికి ఆర్థికంగా అండగా నిలిచి రియల్ హీరోగా నిలిచారు సోనుసూద్.
ఇదిలా ఉండగా.. సోనుసూద్ ఇటీవల పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీని కలిశారు. అంతకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తోనూ భేటీ అయిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యార్థుల కోసం ‘దేశ్ కామెంటర్స్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా సోనుసూద్ను ఢిల్లీ సీఎం ప్రకటించారు. తనను రాజకీయ నాయకులు, పార్టీలు సన్మానించినప్పటికీ.. తన స్వచ్ఛంద సంస్థకు రాజకీయాలతో సంబంధం లేదని ప్రకటిస్తూ వచ్చారు.
ఇప్పటికే రాజకీయాలపై చర్చించలేదని ప్రకటించిన ఆయన.. త్వరలోనే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా సోనుసూద్ను రాజకీయాల్లోకి వస్తారని అని ప్రశ్నించగా.. మొదట మాళవికకు మద్దతు ఇవ్వడం ముఖ్యమని, తర్వాత సొంత ప్రణాళికలపై వెల్లడిస్తానన్నారు. మాళవిక హెల్త్కేర్కు ప్రాధాన్యం ఇస్తుందని, ఆమె ఎన్నికైతే డయాలసిస్ అవసరమైన రోగులకు ఉచితంగా సేవలందిస్తారన్నారు.