కథానాయిక అమలాపాల్ నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నది. ‘కడావర్’ పేరుతో తమిళంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ ఓ సినిమాను నిర్మిస్తున్నది. ఫస్ట్లుక్ పోస్టర్ను అమలాపాల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదలచేసింది. ఇందులో మృతదేహం ఉన్న టేబుల్పై కూర్చొని భోజనం చేస్తూ ఆమె కనిపిస్తున్నది. అమలాపాల్ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలోకి వచ్చి పన్నెండేళ్లు అవుతున్నది. 144 నెలలు..4380 రోజుల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను దాటాను. ‘కడావర్’తో నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నా’ అని తెలిపింది. అనూప్ ఎస్ పణిక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.