హీరో చిరంజీవి ప్రస్తుతం తన 154వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా…మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృతి హాసన్ నాయిక. ఈ సినిమా కొత్త షెడ్యూల్ తాజాగా హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, శృతి హాసన్ పాల్గొంటున్న దృశ్యాలతో పాటు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో భారీ పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి పోరాట ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతున్నది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు కాగా..జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : నిరంజన్ దేవరనూనె, సంగీతం : దేవిశ్రీప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : ఏఎస్ ప్రకాష్, సీఈఓ: చెర్రీ, సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఏ విల్సన్.