అమరావతి : విజయవాడ ( Vijayawada ) లోని ఆటోనగర్లో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఏడు ప్రైవేట్ బస్సులు ( Private Buses ) దగ్ధమయ్యాయి. మెకానిక్ షెడ్డులో ఒక బస్సుకు వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు చెలరేగి సమీపంలోని బస్సులకు వ్యాపించాయి.
సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న మూడు ఫైరింజన్ల మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే గ్యారేజీలో పార్కింగ్ చేసిన ఏడు బస్సులు దగ్ధం మయ్యాయి. మరిన్ని బస్సులకు మంటలు అంటుకోకుండా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు వివరించారు.