తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం ఏ1ఎక్స్ప్రెస్ హీరో హీరోయిన్లు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ… శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏ1 ఎక్స్ప్రెస్ సినిమా విడుదలై మంచి విజయం సాధించిందని పేర్కొన్నారు. అనంతరం సందీప్ కిషన్ మాట్లాడుతూ తనకు తిరుపతితో విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. తన చిత్రం సంపూర్ణ విజయం సాధించిందని, పెద్దలు, పిల్లలు సినిమాను ఎంజాయ్ చేస్తుండడం సంతోషంగా ఉందని అన్నారు. స్వామి వారి కృపతో సినిమా ఘనవిజయం సాధించింది పేర్కొన్నారు.