భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఆర్పీఎఫ్ దళాలు.. 8 మంది నక్సల్ కొరియర్లను పట్టుకున్నారు. జిల్లాలో సీఆర్పీఎఫ్ దళాలు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో వారిని అరెస్టు చేశారు. నక్సల్స్ కొరియర్ల నుంచి 350 ఎలక్ట్రిక్ డిటోనేటర్లను, 9 లిక్విడ్ జెలిటిన్ స్టిక్స్ వైర్లను, మోటారుసైకిళ్లను, నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీఆర్పీఎఫ్ దళాలు పేర్కొన్నాయి.