ఇలాంటి కేవలం మన భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి. ఇప్పటివరకూ మనం 7 సీటర్ ఆటోలో 20 మందికిపైగా ఎక్కించడం చూశాం. కానీ, ఇటీవల ఓ బైకర్ తన ద్విచక్రవాహనంపై ఏడుగురిని ఎక్కించుకొని ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్పై కూర్చుని ఉన్నాడు. ముగ్గురు పిల్లలను బైక్ ఎక్కించాడు. అనంతరం మరో ఇద్దరు మహిళలు బైక్ ఎక్కుతున్నారు. ఆ ద్విచక్రవాహనంపై మొత్తం ఏడుగురు కనిపించారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన సుప్రియా సాహు.. ‘మాటల్లేవ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ వీడియో 3.4 మిలియన్ల వీక్షణలు పొందింది. ఈ వీడియోను 18,000 కంటే ఎక్కువమంది షేర్ చేశారు.
Speechless 😶 pic.twitter.com/O86UZTn4at
— Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2022