కాట్మాండు: నేపాల్లో బురదతో కూడిన వరద(Nepal Floods) విలయం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే శక్తివంతమైన ఆ బురద ధాటికి అనేక ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఆ శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. కొన్ని ఇండ్లల్లో మృతదేహాలను వెలికి తీస్తున్నారు. నువాకోట్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. బిదుర్ మున్సిపాల్టీలోని బేత్రావతి వద్ద ఓ ఇంట్లో 24 మంది మృతదేహాలను బయటకు తీశారు. హెలికాప్టర్ల సహాయంతో నేపాల్ ఆర్మీ గాలింపు చర్యలు చేపడుతున్నది. అయితే వరద ప్రభావానికి గురైన ఓ ఇంటిని పరిశీలిస్తున్న సమయంలో.. ఆ ఇంట్లో అనూహ్య రీతిలో 24 మంది శవాలను గుర్తించారు. ఈ విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ బిపిన్ రెజ్మీ కన్ఫర్మ్ చేశారు.
ప్రస్తుతం ఆ ఇంట్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాల తుది సంఖ్య తర్వాత వెల్లడించనున్నట్లు తెలిపారు. అయితే ఆ ఇళ్లు ఎవరికి చెందినదో తెలియదు. దాని ఓనర్ ఎవరో తెలియదు. స్థానిక అధికారుల సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. బహుశా ఆ బిల్డింగ్ ఓ హోటల్ లేదా గెస్ట్ హౌజ్ అయి ఉంటుందని అంచాన వేస్తున్నారు. కానీ దీన్ని ఎవరూ వెరిఫై చేయలేదు. ఇకే ఇంట్లో ఎందుకు ఇంత మంది ఉన్నారో కనుక్కునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 26వ తేదీన సంభవించిన వరదల్లో మృతుల సంఖ్య వెయ్యి దాటింది.
Twenty-four bodies have been recovered from inside a single house in a flood-affected region of Nuwakot.
District Police Office Nuwakot SP Bipin Regmi informed that 24 bodies were found on Monday inside a home located in Betrawati, Vidur Municipality-10.#NepaleseCity pic.twitter.com/cpHODqnswm
— Nepalese City (@nepalesecity) September 1, 2026