గడ్చిరోలి: అడవిలో ఉన్న ఇద్దరు వయోజనులు తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు మహారాష్ట్ర ఈసీ అధికారులు సంపూర్ణ సహకారం అందించారు. అహెరి-సిరోంచా మార్గంలోని దట్టమైన అడవిలో 107 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ల ఇంటి వద్దే ఓటును నమోదు చేశారు. గడ్చిరోలి-చిముర్ లోక్సభ నియోజకవర్గంలోని వందేండ్ల కిష్టయ్య మదరబోయిన, 86 ఏండ్ల కిష్టయ్య కొమెర అనే ఇద్దరు ఓటర్ల కోసం అధికారులు ఈ పని చేశారని ఈసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.