అభివృద్ధి చేసిన పార్టీ వెంటే ఉంటాం
స్వచ్ఛందంగా.. సంపూర్ణంగా..మద్దతు తెలిపిన పలు సంఘాలు
టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపిద్దాం
ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్టౌన్, మార్చి 12: విపక్షాలు, ఇతర పార్టీలకు ఓటేస్తే వృథా అని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక భవన్లో నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. అదేవిధంగా ఏపీజీవీబీ బ్యాంకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలు ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నదన్నారు. విద్యుత్ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఉందన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు ఆయా సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్, ఏపీజీవీబీ బ్యాంకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ ఉద్యోగులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి సంపూర్ణ మద్దతు తెలిపారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, 1104 యూనియన్ నాయకులు, ఏపీజీవీబీ బ్యాంకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు భూపాల్రెడ్డి, ఓపీసీ ఎంప్లాయీస్ యూనియన్ టీఎస్, ఏపీ అధ్యక్షుడు నాగరాజు, రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యుడు మునీర్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి పలు సంఘాల మద్దతు కొనసాగుతున్నది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అభివృద్ధి చేస్తున్న పార్టీ వెన్నంటే ఉంటామని ప్రకటిస్తున్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మద్దతు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు అదిల్షరీఫ్, అదనపు కార్యదర్శి జహంగీబాబా తెలిపారు.
సీపీఎస్ ఉద్యోగులు..
వనపర్తి టౌన్, మార్చి 12 : రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల తరపున టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఆ సంఘం అధ్యక్షుడు మద్దిలేటి, శ్రీనివాస్, రమేశ్, నర్సింహులు తెలిపారు. మద్దతు తెలిపిన వారిలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, బండి శ్రీను, వెంకటేశ్, హరీష్, సాయిచందర్రెడ్డి తదితరులు ఉన్నారు.
టీఎస్సీపీఎస్యూఈ ..
భూత్పూర్, మార్చి 12: టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపునకు మద్దతు ఇస్తున్నట్లు టీఎస్సీపీఎస్యూఈ జిల్లా అధ్యక్షుడు సనాతన బాలస్వామి శుక్రవారం అన్నారు. సమస్యలు పరిష్కరించాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రవినాయక్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ సమస్యలకు త్వరలో పరిష్కారం
నారాయణపేట, మార్చి 12: ఇంటర్ విద్యలో ఉన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంజనా గార్డెన్లో ఇంటర్ విద్య జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి జేఏసీ నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
టీఆర్ఎస్ వెంటే ఆర్ఎంపీలు
టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆర్ఎంపీలు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్ఎంపీల సంఘం నాయకులు ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డిని కలిశారు. జిల్లాలోని ఆర్ఎంపీలందరూ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే వారినే గెలిపించాలన్నారు. కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు ఆర్ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.