తరలివచ్చిన అశేష భక్తజనం
పట్టువస్ర్తాలు సమర్పించిన ఎస్పీ, ఆర్డీవో, ఆలయ చైర్మన్
కురవిలో వైభవంగా ఉత్సవాలు
కురవి, మార్చి 12 : మహా శివరాత్రిని పురస్కరించుకుని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవం శుక్రవారం వేకువజామున 2.47 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, బాజాభజంత్రీలు.. భక్తుల జయజయధ్వానాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. పోలీస్ రోప్పార్టీ తోడురాగా ఆలయం నుంచి ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, ఆర్డీవో కొమురయ్య, ఆలయ చైర్మన్ బదావత్ రామునాయక్, కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ దంపతులు స్వామివారి తలంబ్రాలను కల్యాణవేదిక వద్దకు తెచ్చారు. ఆలయ ప్రధాన పూజారి పారుపెల్లి రామన్న, వేదపండితులు శివకిరణ్, రవిచంద్ర, శ్రీకర్, పూజారులు తాటికొండ పుణ్యమూర్తి, పెనుగొండ కాశీ, శంకరయ్య కల్యాణ మహోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఎస్పీ కోటిరెడ్డి నేతృత్వంలో ట్రైనీ ఐపీఎస్ యోగేశ్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రూరల్ సీఐ రవికుమార్, కురవి ఎస్ఐ జక్కుల శంకర్రావు ఎప్పటికప్పుడు పరిశీలించారు. వేడుకల్లో ఆలయ మాజీ చైర్మన్ బదావత్ రాజునాయక్, పాలకమండలి సభ్యులు బదావత్ లక్ష్మి, వెంకటరమణ, దేవయ్య, వీరాచారి, ధరణి ప్రాజెక్ట్స్ నిర్వాహకులు రమేశ్, నాగసులోచన, పాలక మండలి మాజీ సభ్యురాలు రమ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జాతరను పర్యవేక్షించిన ఎంపీ..
కల్యాణ మండప ఆవరణ వద్ద ఎంపీ మాలోత్ కవిత జాతర పనులను పర్యవేక్షించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు హరిత, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహబూబ్ పాషా ఉన్నా రు. స్వామివారిని టీఆర్ఎస్ నాయకుడు డీఎస్ రవిచంద్ర దర్శించుకున్నారు.
శ్రీ వీరభద్ర సేవాసమితి మహా అన్నదానం..
భక్తులకు ‘తెలంగాణ రాష్ట్ర శ్రీ వీరభద్ర సేవాసమితి’ ఆధ్వర్యం లో కురవి సంత ఆవరణలో మహాన్నదానం కార్యక్రమాన్ని ఆర్డీవో కొమురయ్య ప్రారంభించారు. సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు షాబా ద్ వెంకటేశం, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీవో విజయలక్ష్మి, ఐకేపీ కిరణ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు నూతక్కి నర్సింహారావు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మేక దామోదర్రెడ్డి, సేవాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసుల వినోద్, కొండూరి వినోద్, షాబాద్ నర్సింహ, రాములు, రమణ, వేణు, అనిల్, శోభారాణి, శారద, నర్ర సాయి పాల్గొన్నారు.
శావను నిలిపి.. 108కి దారిచ్చి..
కల్యాణం ముగించుకొని రోప్పార్టీ బందోబస్తులో నేరడ క్రాస్రోడ్డుపై వీరభద్రస్వామి-భద్రకాళీ అమ్మవార్ల శావ తీస్తుండగా అంతలోనే సైరన్తో అంబులెన్స్ వచ్చింది. వెంటనే అధికారులు, శావ తీస్తున్నవారు స్పందించి శావలను రోడ్డు పక్కన నిలిపి దారివ్వడంతో 108 వెళ్లిపోయింది.