ఎవరికెంత స్మారకం..
జవహర్లాల్ నెహ్రూ..
శాంతివన్.. 52 ఎకరాలు
ఇందిరాగాంధీ..
శక్తిస్థల్.. 45 ఎకరాలు
రాజీవ్గాంధీ..
వీర్భూమి.. 15 ఎకరాలు
లాల్బహదూర్శాస్త్రి..
విజయ్ఘాట్.. 40 ఎకరాలు
చరణ్సింగ్, మొరార్జీ దేశాయ్, వాజపేయి.. ఇలా ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులు నిర్వహించిన ప్రముఖులకు దేశ రాజధాని ఢిల్లీలో సువిశాల ప్రాంతాల్లో సమాధిస్థలాలను, స్మారకాలను నిర్మించారు. కానీ అదే ప్రధాని పదవిలో కొనసాగిన దక్షిణాదికి చెందిన తొలి తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు మాత్రం ఆ గౌరవం దక్కలేదు. అంత్యక్రియలనే హైదరాబాద్లో నిర్వహించారు. ఇక్కడే జ్ఞానభూమి పేరిట 2.9 ఎకరాల స్థలంలో పీవీ ఘాట్ నిర్మించారు. ఢిల్లీలో ప్రముఖుల సమాధి స్థలాలకు కీలక ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాలు కేటాయించడం వీలుకాదని, మాజీ రాష్ట్రపతి జైల్సింగ్ సమాధి ఏక్తాస్థల్ పక్కన 2013లో రాష్ట్రీయ స్మృతి పేరిట ఒక ప్రాంతాన్ని కేటాయించారు. ఆ నిర్ణయాన్ని అంతకు తొమ్మిదేండ్ల ముందు- 2004లో మరణించిన పీవీ నరసింహారావుకు వర్తింపజేశారు. అందులోనే ఒక శిలాఫలకం ఏర్పాటుచేశారు. కానీ ఆ తర్వాత 2018లో మరణించిన బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయికి మాత్రం స్మృతి స్థల్ పక్కనే 1.5 ఎకరాల స్థలాన్ని ‘సదైవ్ అటల్’ పేరిట కేటాయించారు. అందులో కమలం స్మారకాన్ని నెలకొల్పారు.