రెండో రోజు 7 అంశాలపై పోటీ
షార్క్ట్యాంక్లో ఉత్తమ ఆలోచనకు రూ.3 వేల బహుమతి
డ్యాన్స్ పోటీల్లో గెలుపొందిన వారికి రూ.15 వేల నగదు పురస్కారం
కంది, మార్చి, 12 : ఐఐటీ హైదరాబాద్లో ఎలాన్-ఎన్విజన్ 2021 వేడుకలు ఆన్లైన్ ద్వారా కొనసాగుతున్నాయి. రెండో రోజు మొత్తం ఏడు అంశాల్లో పోటీలను నిర్వహించారు. ఈవెంట్ను ప్రముఖ ప్రైవేట్ సంస్థ లార్సెన్ అండ్ టర్బో స్పానర్ చేస్తున్నది. మొత్తం నాలుగు రోజులు సాగే ఈ కార్యక్రమాల్లో దేశంలోని 150కు పైగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొననున్నారు. అలాగే, 50కి పైగా వివిధ అంశాల్లో పోటీలను నిర్వాహకుల ఆధ్వర్యంలో పూర్తిగా వర్చ్యువల్ పద్ధతిలోనే కొనసాగనున్నది.
రెండో రోజు 7 అంశాలపై పోటీ..
వేడుకల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 వరకు హనీవెల్ వెబినార్ కార్యక్రమాన్ని ఎయిర్మీట్ ద్వారా నిర్వహించారు. అనంతరం కార్యక్రమ నిర్వహణ సంస్థ అయిన ఎల్అండ్టీ ఇండస్ట్రియల్ విజిట్ తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలపై సంస్థ డిజిటిల్ హెడ్ నిజీశ్ పద్మనాభన్, మేనేజర్లు సంబిత్ మహంతి వివరించారు. మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఇన్ఫర్మల్ క్విజ్ హబ్ను నిర్వహించారు. ఇందులో విద్యార్థులకు వివిధ అంశాలపై క్విజ్ పోటీలు కొనసాగాయి. షార్క్ట్యాంక్ పేరుతో కొత్త ఎంటర్ ప్రైన్యూర్ను స్థాపించేందుకు ఉత్తమ ఆలోచనలను విద్యార్థుల ద్వారా ఐఐటీ హైదరాబాద్ ఎంటర్ ప్రైన్యూర్షిప్ ప్రొఫెసర్ ఎంపీ.గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహించి ఉత్తమ ఐడియాను అందించిన వారికి రూ.3వేల నగదు పారితోషికాన్ని అందిచనున్నారు. వీటితోపాటు సోషల్ కాజ్, హనీవెల్ వెబినార్లో భాగంగా వ్యక్తలు విద్యార్థులతో పలు అంశాలను చర్చించారు.
మ్యాజిక్, డ్యాన్స్ పోటీలు.. యాక్టర్తో ఇన్ట్రాక్షన్లు..
ప్రముఖ మెజీషియన్ సుహానీ షాతో సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు నిర్వహించిన మ్యాజిక్ ఈవెంట్ అందరినీ ఆకట్టుకున్నది. కార్యక్రమంలో చివరగా ప్రముఖ నటి శ్రియ పిల్గొన్కర్తో విద్యార్థులు చిట్చాట్ జరిపారు. కార్యక్రమంలో చివరిదైన బ్రేక్ ఫ్రీలో భాగంగా ప్రత్యేకంగా డ్యాన్స్ పోటీలను నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి చివరి రోజున రూ.15వేల నగదు పురస్కారాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.